జియో హ‌వా.. ఒక్క నెల‌లో 40 ల‌క్ష‌ల మంది కొత్త క‌స్ట‌మ‌ర్లు 

టెలికం రంగంలో పోటీ ఆస‌క్తిక‌రంగా మారుతోంది. ఎయిర్‌టెల్‌,  వొడాఫోన్ ల‌క్ష‌ల్లో క‌స్ట‌మ‌ర్ల‌ను కోల్పోతే జియో అంతే వేగంగా కొత్త క‌స్ట‌మ‌ర్ల‌ను యాడ్ చేసుకోగ‌లిగింది. టెలికం రెగ్యులేట‌రీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌) లేటెస్ట్‌గా మార్చి నెల రిపోర్ట్‌ను రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్ చెప్పిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలేమిటో చూడండి. 

75 ల‌క్ష‌ల మంది క‌స్ట‌మ‌ర్ల‌ను కోల్పోయిన ఎయిర్‌‌టెల్‌, వొడాఫోన్  
* మార్చి నెల‌లో వొడాఫోన్‌, ఎయిర్‌టెల్ కలిసి ఏకంగా 75 ల‌క్షల మంది క‌స్ట‌మ‌ర్ల‌ను కోల్పోయాయి. ఇందులో ఎయిర్‌టెల్ వాటా 12 ల‌క్ష‌లు. ఇక వొడాఫోన్ అయితే ఒక్క నెల‌లోనే 63 ల‌క్ష‌ల మంది వినియోగ‌దారుల‌ను పోగొట్టుకుంది.

*జియో ఇదే నెల‌లో కొత్త‌గా 46 ల‌క్ష‌ల మంది క‌స్ట‌మ‌ర్ల‌ను యాడ్ చేసుకోగ‌లిగింది.

* ప్ర‌భుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ 96 వేల మంది క‌స్ట‌మ‌ర్ల‌ను మార్చిలో యాడ్ చేసుకోగ‌లిగింది. 

 

మార్కెట్‌లో ఎవ‌రి వాటా ఎంత‌? 
1. జియో  33.47% (38.7 కోట్లు)

2. ఎయిర్‌టెల్ 23.81% (32.7 కోట్లు)

3. వొడాఫోన్ ఐడియా 27.57 (31.9 కోట్లు) 

4. బీఎస్ఎన్ఎల్ 10.35% (11.9 కోట్లు)

5. ఎంటీఎన్ఎల్ 0.29% (33.6 ల‌క్ష‌లు) 

జియో హ‌వా ట్రాయ్ మార్చి రిపోర్ట్‌ Jio Customers Jio On top